బ్రేకింగ్... ప్రభాస్ కూడా షూటింగ్ ఆపేస్తున్నాడు!
on Mar 17, 2020
కరోనా ధాటికి సినిమా ఇండస్ట్రీ అష్టకష్టాలు పడుతోంది. ఆల్రెడీ థియేటర్లు క్లోజ్ చేశారు. తెలంగాణలో సినిమా షూటింగులు చేయకూడదని చిత్ర పరిశ్రమ నిర్ణయం కూడా తీసుకుంది. ఫారిన్ టూర్లు క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా జార్జియాలో ప్రభాస్20 సినిమా షూటింగ్ జరుగుతోంది. పది డిగ్రీల చలిలో, జోరుగా కురిసే వర్షంలో కరోనా ముప్పును పట్టించుకోకుండా చిత్రబృందం అంతా కష్టపడి పని చేస్తోందని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్వీట్ కూడా చేశారు. సినిమాపై ప్రేమతో కరోనాను లెక్కచేయకుండా మాస్క్ వేసుకుని మరి జార్జియా వెళ్లారు పూజా హెగ్డే. ఆమె రెండు రోజుల షూటింగ్ కూడా చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఎంటంటే... ఈ సినిమా షూటింగ్ ఆపేస్తున్నారు. బ్యాకప్ చెప్పేసి ఇండియా తిరిగి రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిటర్న్ టికెట్స్ బుక్ చేసే పనిలో ఉన్నారు. యూరప్ నుండి ఇండియా వచ్చే రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ నెలాఖరు వరకు లేదా ఏప్రిల్ 15 వరకు జార్జియాలో షూటింగ్ చేయాలనుకున్నారు. కరోనా దెబ్బకు ప్లాన్స్ అన్నీ చెల్లాచెదురయ్యాయి. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.