హనీమూన్ ట్రిప్లో మొగుడు మీద కేసు పెట్టిన హాట్ బ్యూటీ!
on Sep 23, 2020
పూనమ్ పాండే పేరే ఒక సెన్సేషన్. ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండటానికి ప్రయత్నించే మోడల్. టీమిండియా వరల్డ్ కప్ నెగ్గితే నగ్నంగా తిరుగుతానని చెప్పడం వరకు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు, వీడియో పోస్టింగుల వరకు లైమ్ లైట్లో ఉండటానికి ఆమె చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పబ్లిసిటీ కోసం మొగుడు మీద కేసు పెట్టిందో? నిజంగా అతడు ఆమె వేధింపులకు గురి చేశాడో? పెళ్లై నెల తిరగకుండానే మొగుడు మీద పూనమ్ పాండే కేసు పెట్టింది.
బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేతో ఈ నెలలో పూనమ్ పాండే వివాహమైంది. సెప్టెంబర్ 10న పెళ్లైన విషయం ఆమె ప్రకటించింది. హాట్ యాక్ట్రెస్ పెళ్లి చేసుకోవడం కొందరికి షాక్ ఇచ్చింది. పెళ్లైన వెంటనే గోవాకి హనీమూన్ ట్రిప్ వేశారు. హనీమూన్ ట్రిప్ తో పాటు సౌత్ గోవాలో కనకొనా గ్రామంలో ఒక సినిమా షూటింగ్ పెట్టుకుంది పూనమ్.
గోవాలో తనను వేధించడంతో పాటు చంపేస్తానని బెదిరించాడని పూనమ్ పాండే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. గోవా పోలీసులు సామ్ బాంబేని అరెస్ట్ చేశారు. ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసే పూనమ్ పాండే ఈ విషయం ఇంకా షేర్ చేయలేదు. ఏడు జన్మల వరకు సామ్ బాంబైతో కలిసి ఉంటానని పెళ్లైన విషయం ప్రకటించినప్పుడు పేర్కొన్న ఆమె, రెండు వారాలు కూడా తిరగకముందే భర్త మీద కేసు పెట్టడం గమనార్హం.
Also Read