పూనమ్ కౌర్ టార్గెట్ ఎవరు
on Jan 29, 2018
కొద్దిరోజుల క్రితం పవన్ అభిమానులు-కత్తి మహేశ్ల కోల్డ్వార్ మధ్య చిక్కుకుని ఫుల్ పాపులర్ అయ్యింది హీరోయిన్ పూనమ్కౌర్. పవన్ని సపోర్ట్ చేసినందుకు గానూ.. పూనమ్కి పవన్కి మధ్య ఇలా జరిగిందంటూ ఓ ఆరు ప్రశ్నలు సంధించాడు. ఇందులో వాస్తవమెంతో తెలియదు కానీ.. ఆ ఆరు ప్రశ్నలు అభిమానుల మెదళ్లను తొలిచివేశాయి. ఆ తర్వాతి కాలంలో కత్తికి.. పవర్స్టార్ ఫ్యాన్స్కి రాజీ కుదిరడంతో పూనమ్ను జనం మరచిపోయారు. అలాంటి పూనమ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారింది.
డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు… మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయతీ… నీ గుణం ఏంటి?” అని ప్రశ్నించింది. ఎవరిని ఉద్దేశిస్తూ.. ఆమె ఈ ట్వీట్ చేసిందో తెలియదు గానీ... ఈ వ్యాఖ్యలు సంచలనం రేకిత్తిస్తున్నాయి. కాగా, ఈ ట్వీట్ తమ అభిమాన నటుడు పవన్ని ఉద్దేశించి చేసినవే అంటూ ఆయన అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు..
తన పార్టీని ప్రశ్నించడం కోసమే స్థాపించానన్న పవన్.. ఇప్పుడు ఇద్దరు చంద్రుల సేవలో తరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పూనమ్ ట్వీట్ కూడా దీనికి దగ్గరగా ఉండటమే పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం. తనకు అండగా ఉన్న వ్యక్తిపైనే ఆరోపణలు చేస్తోందని.. పబ్లిసిటీ కోసం నాటకాలు ఆడితే.. తగిన శాస్తి చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. తన ట్వీట్తో దుమారం రేగిన సంగతి గుర్తించిన పూనమ్ దీనిపై స్పందించింది. నా ట్వీట్ ప్రత్యేకించి ఎవరినీ ఉద్దేశించినది కాదు.. డబ్బు కోసం కన్న కూతురిని అమ్మిన వ్యక్తుల గురించి ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పింది. కానీ ఈ క్లారిటీతో పవన్ అభిమానులు శాంతించలేదు.. ఆమె ఎక్స్ప్లనేషన్ నమ్మబుద్దిగా లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లకు ఫుల్స్టాప్ పెట్టలేదు.