మెసేజ్కి కూడా తమన్ రెస్పాండ్ కావట్లేదు!
on Jan 13, 2020
"తమన్ ఇవాళ బిగ్ స్టార్ అయిపోయాడు. మెసేజెస్కు కూడా రెస్పాండ్ కానంత బిజీ స్టార్ అయ్యాడు. ఈ సినిమాకు ఆత్మనిచ్చాడు. అతనికి గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది" అని చెప్పింది పూజా హెగ్డే. 'అల వైకుంఠపురములో' మూవీలో అమూల్య పాత్రలో ఆమె ఆకట్టుకుంది. బన్నీకి మేడంగా నటించి, అతని ప్రేమలో పడే పాత్రలో కావాల్సినంత గ్లామర్ కురిపించింది. 'అల వైకుంఠపురములో' థాంక్స్ మీట్లో ఆమె మాట్లాడింది.
'అరవింద సమేత' తర్వాత త్రివిక్రంతో ఆమెకిది రెండో సినిమా. "ఈ సినిమాతో త్రివిక్రంకు పెద్ద ఫ్యాన్ అయ్యాను. దర్శకునిగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా ఆయనకు అభిమానిగా మారాను. ఆయన నాకు గురూజీ అంతే" అని స్పష్టం చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వంటి బ్యానర్లో రెండో సినిమా (మొదటి సినిమా 'అరవింద సమేత') చేసినందుకు చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. "అల్లు అరవింద్ గారు సెట్కి వచ్చారంటే ఒక వెలుగు వచ్చినట్లుంటుంది. ఆయన బేనర్లో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా" అని అంటూ ఆయనను వేదికపై హగ్ చేసుకుంది. ఫైట్ మాస్టర్లు రాం-లక్ష్మణ్ స్టైల్ గురించి ప్రస్తావిస్తూ "ప్రతి సినిమాకీ వాళ్లు కొత్తగా ఫైట్లు ఇస్తుంటారు. వాళ్లు స్టైలిష్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు" అని పొగిడింది. అల్ల్లు అర్జున్్కు హీరోయిన్గా తనను రిపీట్ చేసిన త్రివిర్కంకు థాంక్స్ చెప్పింది. 'డీజే' చేసినప్పట్నుంచీ బన్నీకి అభిమానినయ్యానని చెప్పింది పూజ.
Also Read