ప్రభాస్ దర్శకుడు అబద్ధం చెప్తే.. పూజా హెగ్డే నిజం చెప్పింది!
on Mar 23, 2020
కరోనా దెబ్బకు జార్జియా షెడ్యూల్ మధ్యలో ఆపేసి ప్రభాస్ అండ్ టీమ్ ఇండియా వచ్చారంటే దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఒప్పుకోలేదు. రెండు రోజుల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉండగా, యుద్ధ పాత్రిపదికన చిత్రీకరణ ముగించుకుని ఇండియా వచ్చామని ఆయన అన్నారు. మార్చి 3న ప్రభాస్20 యూనిట్ జార్జియా వెళ్ళింది. అక్కడ 14 రోజులు షెడ్యూల్ మాత్రమే ప్లాన్ చేశామనేది దర్శకుడి వెర్షన్. కరోనా దెబ్బకు షూటింగ్ మధ్యలో ఆపేశారని వచ్చిన వార్తలన్నీ పుకార్లు అని దర్శకుడు అన్నారు. కానీ, ముంబై మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షూటింగ్ ముందుగా ముగించుకుని వచ్చామని పూజా హెగ్డే చెప్పడం గమనార్హం.
జార్జియాలోని తిబ్లిసీలో ప్రభాస్20 మూవీ షూటింగ్ చేశారు. పూజా హెగ్డే అక్కడికి వెళ్లిన మూడు రోజులకు షూటింగ్ ప్యాకప్ చెప్పేశారు. మూడు రోజుల షూటింగ్ కోసం హీరోయిన్ని అంత దూరం తీసుకు వెళతారా? చిన్న లాజిక్ ఆలోచించినా ఆన్సర్ దొరుకుతుంది. కరోనా వల్ల షూటింగ్ ముందుగా ప్యాకప్ చెప్పారని. అయితే... పూజా హెగ్డే అసలు మ్యాటర్ చెప్పారు. "అందరం కలిసి ప్యాకప్ చెప్పి ఇండియాకి రావాలని డెసిషన్ తీసుకున్నాం" అని ఆమె అన్నారు. షూటింగులో టీమ్ అందరూ చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. "ఇంకా చాలా షూటింగ్ చేయాలి. నిర్మాతలు కొత్త లొకేషన్స్ ప్లాన్ చేయాలి" అని పూజా హెగ్డే తెలిపారు. అదీ సంగతి!
Also Read