రిచా చద్దా పంపిన లీగల్ నోటీస్ అందుకున్న పాయల్ ఘోష్!
on Sep 22, 2020
రిచా చద్దా ఇచ్చిన లీగల్ నోటీస్ను ఎట్టకేలకు పాయల్ ఘోష్ తీసుకుంది. పాయల్కు నోటీస్ అందించడానికి ప్రయత్నించడం రిచాకు ఇది మూడోసారి కావడం గమనార్హం. ట్విట్టర్లో ఈ విషయాన్ని షేర్ చేసుకుంది రిచా. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్పై చేసిన "మీ టూ" ఆరోపణల్లో తన పేరును తప్పుగా లాగడంపై పాయల్కు లీగల్ నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ వచ్చింది రిచా. ఇదివరకు రెండు సార్లు రిచా లీగల్ టీమ్ సభ్యుడు ఆ నోటీస్ను ఇవ్వడానికి ప్రయత్నించగా, తీసుకోవడానికి ఆమె తిరస్కరిస్తూ వచ్చింది.
ఇప్పుడు నోటీస్ అందజేసినట్లుగా షిప్మెంట్ డెలివర్డ్ పేజ్ స్క్రీన్షాట్ను తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన రిచా చద్దా, "అప్డేట్: మిస్ ఘోష్కు లీగల్ నోటీస్ డెలివర్ అయ్యింది" అని పేర్కొంది. అంతకుముందు రిచా లీగల్ టీమ్ రెండోసారి లీగల్ నోటీస్ను అందజేయడానికి వెళ్లినప్పుడు, ఆమె తీసుకోలేదు. అప్పుడు రిచా, "అప్డేట్: తనను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన ప్రెస్ మెంబర్స్ను అనుమతిస్తూ వస్తున్న మిస్ ఘోష్ లీగల్ నోటీస్ అందజేయడానికి వచ్చిన నా లీగల్ టీమ్ పర్సన్ను మాత్రం గేట్ దగ్గరే ఆపేసి, నోటీస్ను తిరస్కరించింది" అని ట్వీట్ చేసింది.
సోమవారం రిచా చద్దా ఓ ప్రకటన విడుదల చేస్తూ, అనురాగ్ కశ్యప్పై పాయల్ చేసిన మీ టూ ఆరోపణల్లో తన పేరును అనవసరంగా, తప్పుగా లాగడంపై దావా వేయనున్నట్లు తెలిపింది. కశ్యప్ తనను లైంగికంగా వేధించే క్రమంలో రిచా చద్దా, హుమా ఖురేషి తనతో గడిపేవారని చెప్పినట్లు పాయల్ వెల్లడించింది.
Also Read