పవన్-త్రివిక్రమ్ మధ్య దోస్తీ ఎలా మొదలైంది..?
on Nov 7, 2017
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్నాడో సినీ కవి.. నిజమే స్నేహం అద్భుతమైనది.. నిజమైన స్నేహితులకు మించిన ఆస్తి లేదు.. స్నేహానికి ఎల్లలు లేవు.. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. దీనికి వయసుతో సంబంధం లేదు.. అన్ని రంగాల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నట్లే సినీ రంగంలోనూ మంచి స్నేహితులు ఉన్నారు. వారిలో ఒక జోడి పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ ఎక్కడుంటే త్రివిక్రమ్ అక్కడుంటాడు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఇలా ఏ చిన్న ఈవెంట్ జరిగినా ఒకరి ఒకరు తోడు ఉండాల్సిందే. చాలా అరుదుగా మాత్రమే వీరిద్దరూ విడివిడిగా కనిపిస్తుంటారు. అసలు ఎవరితో కలవకుండా.. చాలా రిజర్వుడుగా ఉండే పవన్ లాంటి వ్యక్తితో త్రివిక్రమ్కి అసలు దోస్తి ఎలా కుదిరింది.
ఎప్పుడో పవన్ గోకులంలో సీత సినిమా చేస్తున్నప్పుడు అసిస్టెంట్ రైటర్గా త్రివిక్రమ్ను మొదటిసారి చూసింది.. మాట్లాడింది. కళ్యాణేమో మెగాస్టార్ తమ్ముడు.. మరీ వీరిబంధం ఇంతగా బలపడటానికి కారణాలేంటి..? సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులుగా పవన్- త్రివిక్రమ్లు ఇద్దరు ఒకరి గురించి ఒకరికి తెలుసు.. అయితే జల్సా సినిమా చేస్తున్నప్పుడు వీరిద్దరి బంధం బలపడింది.. ఇద్దరూ పుస్తక ప్రియులు కావడంతో.. మంచి పుస్తకాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే వారు. పైగా చెగువేరా భావజాలాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తులు.. మరి ఇన్ని సారుప్యాలు ఉంటే ఆ బంధం బలంగా పెనవేసుకోకుండా ఉంటుందా..? అప్పటి నుంచి వీరిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఆదర్శ స్నేహితులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పవన్కు చేదోడు వాదోడుగా ఉంటూ.. ప్రతి అడుగులోనూ సూచనలు అందజేస్తూ మిత్రుడిని ప్రొత్సహిస్తున్నాడు త్రివిక్రమ్. వీరి స్నేహం కలకాలం ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుందాం.