మరోసారి పోలీస్ క్యారెక్టర్లో పవర్ స్టార్?
on Aug 4, 2020
2012లో 'గబ్బర్సింగ్' వంటి బ్లాక్బస్టర్ చేసిన పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ పునరావృతం కాబోతోంది. ఆ ఇద్దరి కలయికలో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివర ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉండే ఈ సినిమాలోనూ పవన్ కల్యాణ్ను పోలీసాఫీసర్గా హరీశ్ శంకర్ చూపించనున్నట్లు ప్రచారంలోకి వచ్చింది.
'గబ్బర్సింగ్'లో టైటిల్ రోల్ చేసిన పవన్ పోలీస్ ఇన్స్పెక్టర్గా కనిపించిన విషయం తెలిసిందే. ఈ సమాచారమే నిజమైతే, ఫ్యాన్స్ మరోసారి సంబరాలు చేసుకోవచ్చన్న మాటే. ఈ సినిమా 2021లోనే ప్రేక్షకుల ముందుకు రావచ్చు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'వకీల్ సాబ్', క్రిష్ డైరెక్షన్లో 'విరూపాక్ష' (పరిశీలనలో ఉన్న టైటిల్) సినిమాలు చేస్తున్నారు. థియేటర్లు తెరుచుకుంటే 'వకీల్ సాబ్' ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నది. మరోవైపు 'గద్దలకొండ గణేష్' వంటి హిట్ సినిమా తర్వాత వేరే సినిమా ఏదీ చేయకుండా పవన్ కల్యాణ్తో చేసే సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు హరీశ్ శంకర్.
Also Read