'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ షూట్ షురూ!
on Jan 25, 2021
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. మలయాళంలో బిజూ మీనన్, పృథ్వీరాజ్ నటించగా బ్లాక్బస్టర్ హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు ఇది రీమేక్. దీనికి సాగర్ కె. చంద్ర ('అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్) దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ప్లే, సంభాషణలను త్రివిక్రమ్ అందిస్తుండటం విశేషం.
తొలి షెడ్యూల్లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో పదిరోజుల పాటు హైదరాబాద్లో సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం అల్యూమినయం ఫ్యాక్టరీలో ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోందని తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
సముద్రకని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఇప్పటివరకు ఎంపికైన తారాగణం. తమన్ సంగీతం సమకూరుస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్గా, నవీన్ నూలి ఎడిటర్గా, ఎ.ఎప్. ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పకులుగా పి.డి.వి. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.