మేనల్లుడు సినిమాకు క్లాప్ కొట్టిన మెగాస్టార్!!
on Jan 21, 2019
`రంగస్ఠలం` చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో ఓ మైలురాయి చిత్రంలా నిలిచిపోయింది. ఇటువంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను వరుసగా నిర్మిస్తూ ముందుకు దూసుకెళ్తోంది మైత్రీ మూవీ మేకర్స్. నేను ఈ బేనర్ లో సినిమా చేయకపోయినా...రంగస్ఠలం సినిమా సమయంలో ఈ నిర్మాతల గురించి గొప్ప గా చెప్పే వాడు చరణ్. అలా ఈ బేనర్ తో నాకు మంచి మైత్రి కుదరింది`` అన్నారు చిరంజీవి. మేనల్లుడు వైష్టవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ...``ఇంత పెద్ద బేనర్ లో వైష్ణవ్ హీరోగా పరిచయం కావడం తన అదృష్టం. సుకుమార్ దగ్గర పని చేసిన బుచ్చిబాబు ఈ సినిమాకు డైరక్షన్ చేస్తున్నాడు. కథ విన్నాను చాలా బావుంది. ఇదొక రస్టిక్ స్టోరి. రంగస్ఠలం సినిమాకు బుచ్చిబాబు ఎంతో హెల్ప్ చేసాడని చెప్పాడు సుకుమార్. తన అసిస్టెంట్స్ ని డైరక్టర్స్ ని పరిచయం చేస్తూ ఇలా ఎంకరేజ్ చేయడం సుకుమార్ గొప్పతనం. ఈ టీమ్ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా`` అన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా మనీషా అనే తెలుగమ్మాయి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, నిహారిక తదితరులు పాల్గొన్నారు.