బాలకృష్ణ హీరోయిన్.. ఇద్దరు శ్రీనివాసులు!
on Dec 19, 2018
నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'పైసా వసూల్'. ఇందులో ఓ హీరోయిన్గా, శ్రియ సిస్టర్ క్యారెక్టర్లో నటించిన అమ్మాయి గుర్తుందా? పేరు ముస్కాన్ సేథీ. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుందామె. విచిత్రం ఏంటంటే... రెండు సినిమాల దర్శకులు పేరు ఒక్కటే. 'పైసా వసూల్' తరవాత నిర్మల్ నేపథ్యంలో తెలంగాణ సంప్రదాయలకు పెద్ద పీట వేస్తూ కొత్త దర్శకుడు శ్రీనివాస రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా ఒకటి ముస్కాన్ సేథీ అంగీకరించారు. తాజాగా తెలుగులో మరో సినిమా అంగీకరించిందామె. తమిళ నటుడు గణేష్ వెంకట్రామన్ హీరోగా నటించనున్న ఈ సినిమాకు నాగార్జున 'ఢమరుకం' ఫేమ్ శ్రీనివాసరెడ్డి దర్శకుడు. ఇద్దరు శ్రీనివాసుల్లో ఒకరు దర్శకత్వానికి కొత్త అయితే... మరొకరు అనుభవజ్ఞులు. గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ జంటగా నటించే సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం అవుతుందట.