భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పూనమ్ కూడా...
on Nov 26, 2020
ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని సాధించడంతో 1977లో ఒక్కసారిగా ఫేమ్ వచ్చేసింది పూనమ్ ధిల్లాన్కు. 'త్రిశూల్' (1978)తో దిగ్గజ దర్శకుడు యశ్ చోప్రా ఆమెను బాలీవుడ్కు పరిచయం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్టవడంతో ఓవర్నైట్ స్టార్గా మారారు పూనమ్. అనేకమంది దర్శకులు ఆమెతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. ఆమె మాత్రం రెండో సినిమా డైరెక్టర్గా రమేశ్ తల్వార్ను ఎంచుకున్నారు. ఆ సినిమా 'నూరీ'. అది చేసే టైమ్లో ఆ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. రమేశ్ అయితే ఆమెకు మనసిచ్చేశారు. ముంబైలో ఆమెకు ఓ బంగళా కూడా కొనిచ్చారు. అయితే ఆమె ఆయనను ఫ్రెండ్గానే భావించింది కానీ, ఆయనలో లవర్ని చూడలేకపోయారు. అందుకే ఆయనకు దూరంగా ఉండటం మంచిదనుకొని, అన్ని సంబంధాలను తెంచుకున్నారు పూనమ్.
1980లలో ఆమె స్టార్ హీరోయిన్గా రాణించారు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగా డైరెక్టర్ రాజ్ సిప్పీతో పరిచయం, బలమైన స్నేహంగా మారింది. అప్పటికే వివాహితుడైన ఆయన ప్రేమలో పడ్డారు పూనమ్. వారి రిలేషన్షిప్ టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. సిప్పీని మ్యారేజ్ చేసుకోవాలని ఆమె అనుకున్నారు. కానీ ఆమె కోసం తన కుటుంబాన్ని వదలడానికి రాజ్ సిప్పీ అంగీకరించలేదు. ఆయన జీవితంలో రెండో స్త్రీగా ఉండాలని ఆమె కూడా అనుకోలేదు. అందుకే ఆయనతో బంధాన్ని కూడా ఆమె తెంచేసుకున్నారు.
1988వ సంవత్సరం పూనమ్ జీవితంలో చాలా మార్పులు జరిగాయి. సిప్పీతో బంధం ముగియడమే కాకుండా, తండ్రిని కూడా ఆమె కోల్పోయారు. అంతే కాదు, అశోక్ ఠకేరియా పరిచయమైంది అప్పుడే. ఒక ఫ్రెండ్ ఫామ్హౌస్లో జరుగుతున్న హోలి సెలబ్రేషన్స్కు వెళ్లి ఓ మూల కూర్చున్న ఆమె అశోక్ దృష్టిలో పడ్డారు. ఆమె అందం ఆయనను మెస్మరైజ్ చేసింది. తనను పరిచయం చేసుకున్నారు ఠకేరియా. ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ వచ్చారు. అదే ఏడాది పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీలోని పూనమ్ శ్రేయోభిలాషులు ఆమె నిర్ణయాన్ని తప్పుపట్టారు. కెరీర్లో తిరిగి మంచి రోజులు వస్తున్న తరుణంలో దాన్ని వారు తొందరపాటు చర్యగా భావించారు.
అశోక్ ఠకేరియాతో పెళ్లి తర్వాత ఆమె నటనకు బ్రేక్ ఇచ్చారు. రెండేళ్ల తర్వాత తన బిజినెస్తో అశోక్ బిజీగా మారగా, పూనమ్కు పని లేకుండా ఉండటం కష్టమైంది. తిరిగి సినిమాల్లోకి వచ్చారు. ఈ లోపు ఆమె ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. 1994లో భర్త అశోక్ వివాహేతర సంబంధం గురించి ఆమెకు తెలిసింది. భర్తకు గుణపాఠం చెప్పాలనుకున్న ఆమె తను కూడా అలాంటి సంబంధాన్నే ఏర్పరచుకోవడం దిగ్భ్రాంతికరమైన విషయం. 1997లో విడాకులకు దరఖాస్తు చేసుకున్న ఆమె.. ఇద్దరు పిల్లలు తన దగ్గరే ఉండేలా కోర్టు అనుమతి పొందారు.
వ్యక్తిగత జీవితంలో అలాంటి బాధాకరమైన అనుభవాలు చవిచూసిన ఆయన, తనను తాను సంభాళించుకొని, సొంత వ్యాపారం మొదలుపెట్టారు. పిల్లలను చక్కగా పెంచుతూ వచ్చారు. 2001లో రామోజీ రావు నిర్మించిన 'ఇష్టం' సినిమా ఆమె నటించిన ఏకైక తెలుగు చిత్రం. 2009లో మాధవన్తో విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన '13బి' సినిమాతో నటిగా ఆమె థర్డ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అప్పట్నుంచీ ఆమె వెనుతిరిగి చూడలేదు. సినిమాలు, టీవీ సీరియల్స్తో బిజీగా ఉంటున్నారు.
Also Read