'రంగ్ దే' కోసం మళ్లీ సెట్స్ మీదకు వచ్చిన నితిన్!
on Sep 23, 2020
యువ కథానాయకుడు నితిన్, 'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ల తొలి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే'. 'తొలిప్రేమ','మజ్ను' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా కొద్ది నెలలుగా ఆగిపోయిన షూటింగ్ బుధవారం హైదరాబాద్ లోపునః ప్రారంభమయింది.
షూటింగ్ కు సంబంధించి సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. నితిన్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం ఈరోజు షూటింగ్ లో పాల్గొన్నారు. చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణతో కొద్దిరోజులలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుంది.
లవ్ స్టోరీ మేళవించిన కుటుంబ కదా చిత్రం 'రంగ్ దే'. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేస్తుండగా, రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.