'రంగ్ దే' విడుదలకు ముందే కీర్తితో నితిన్...
on Apr 4, 2020
'రంగ్ దే'... నితిన్, 'మహానటి' కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్న తొలి సినిమా. ఈ సినిమా తర్వాత మరోసారి వీళ్లిద్దరూ జంటగా నటించనున్నారు. 'రంగ్ దే' విడుదలకు ముందే కీర్తీతో నితిన్ మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఆల్రెడీ గత నెలలో కథ విన్న కీర్తీ సురేష్, ఈ సినిమాలో నటించడానికి 'ఎస్' అన్నారట. దర్శకుడిగా మారిన గేయ రచయిత కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్ 'పవర్ పేట' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
'ఛల్ మోహన్ రంగ' తర్వాత హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో సెకండ్ సినిమా ఇది. ఇందులో నితిన్ సరసన కీర్తీ సురేష్ నటించనున్నారు. ఏలూరు టౌన్ అమ్మాయిగా ఆమె కనిపిస్తారని సమాచారం. గోదావరి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరూ గోదావరి యాసలో మాట్లాడతారట. ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకి హైలైట్ అవుతుందని యూనిట్ టాక్. కరోనా కారణంగా ఈ సినిమా పనులకు కూడా బ్రేక్ పడింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత సినిమా మళ్లీ పనులు మొదలుపెట్టాలని చూస్తున్నారు.