గాంధీ జయంతికి 'నిశ్శబ్దం'గా ఓటీటీలోకి!
on Sep 15, 2020
తెలుగు తెరపై అరుంధతిగా అలరించి దేవసేనగా ప్రేక్షకుల మనసు గెలిచిన అనుష్క అలియాస్ స్వీటీ నటించిన తాజా చిత్రం 'నిశ్శబ్దం' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహాత్మా గాంధీ జయంతి కి ఈ సినిమా విడుదలవుతోంది. 'నిశ్శబ్దం' స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకుంది. అయితే ఇంకా అగ్రిమెంట్ పూర్తి కాలేదు. బుధవారం నిర్మాతలు, ఓటీటీ ప్రతినిధుల మధ్య ఫైనల్ మీటింగ్ జరగనుంది. అందులో అగ్రిమెంట్ మీద సంతకాలు చేస్తున్నారని సమాచారం.
అనుష్క, మాధవన్, అంజలి, శాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ సినిమాను తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కించారు. హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇంగ్లీష్ భాషలోనూ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే, ఇంగ్లీష్ వెర్షన్ ఓటీటీకి ఇస్తున్నారా? లేదా? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.
హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మించారు.
Also Read