హీరోయిన్ను మోసం చేసిన కేఫ్ ఓనర్!
on Apr 15, 2021
గ్లామరస్ హీరోయిన్ నిక్కీ గల్రాణీ మోసపోయింది. ఒక కేఫ్ ఓనర్ తనను చీట్ చేశాడంటూ పోలీసులకు కంప్లయింట్ చేసింది. బెంగళూరుకు చెందిన నిక్కీ టాలీవుడ్కు సునీల్ సరసన నటించిన 'కృష్ణాష్టమి' ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ఆది పినిశెట్టి సరసన 'మలుపు' సినిమాలో నటించింది. పాపులర్ కన్నడ నటి, తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి, ఇటీవల డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంజనా గల్రాణీకి నిక్కీ స్వయానా సోదరి.
పోలీసులకు నిక్కీ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కోరమంగళలోని 'రెస్టో కేఫ్'లో 2016లో ఆమె రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టింది. అగ్రిమెంట్ ప్రకారం దాని యజమాని నిఖిల్ హెగ్డే ప్రతి నెలా ప్రాఫిట్లో షేర్ కింద రూ. లక్ష ఇస్తానని ప్రామిస్ చేశాడు. కానీ ఇంతదాకా అతను తనకు ఆ అమౌంట్ను చెల్లిచడం కానీ, తాను చేసిన ఇన్వెస్ట్మెంట్ను తిరిగివ్వడం కానీ చెయ్యలేదని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. పైగా, కొన్ని నెలలుగా తను ఫోన్ చేస్తున్నా అతను సమాధానం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది.
ఆమె చేసిన కంప్లయింట్ ప్రకారం నిఖిల్ హెగ్డేపై పోలీసులు చీటింగ్ కేసును నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.