నిఖిల్తో అనూ?
on Jun 4, 2020
అనూ ఇమ్మాన్యుయేల్ గుర్తుందా? నాచురల్ స్టార్ నాని సరసన 'మజ్ను' చిత్రంలో నటించింది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సరసన నటించే అవకాశం ఆమెకు వచ్చిందని సమాచారం. '18 పేజస్'లో అనూను కథానాయికగా తీసుకున్నారట. నిఖిల్ హీరోగా 'కుమారి 21ఎఫ్' సూర్య ప్రతాప్ పలనాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. సుకుమార్ అండదండలు ఈ సినిమాకు పుష్కలంగా ఉన్నాయి. మెమరి లాస్ కాన్సెప్ట్ తో కొత్త కథతో స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఈ సినిమాతోనైనా అను ఇమ్మాన్యుయేల్ హిట్ కొడుతుందేమో చూడాలి.
తెలుగులో తొలి చిత్రం 'మజ్ను'తో విజయం అందుకుంది. అయితే, ఆ తర్వాత ఆమె ఖాతాలో మరో ఘన విజయం పడలేదు. రాజ్ తరుణ్ సరసన నటించిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' పర్వాలేదు అనిపించుకుంటే... పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', అక్కినేని నాగచైతన్య 'శైలజ రెడ్డి అల్లుడు' చిత్రాలు అంచనాలు అందుకోలేక చతికిల పడ్డాయి. అయితే... అనూ ఇమ్మాన్యుయేల్ అందంగా ఉంటుంది. హాట్ ఫిగర్ కూడా! అందుకని మీడియం రేంజ్ హీరోలు తమ సినిమాలో అనూని కథానాయికగా తీసుకుంటున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అల్లుడు అదుర్స్' చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ ఓ కథానాయికగా నటిస్తోంది.