'రెడ్' రిలీజయ్యాకే.. తర్వాతి సినిమా సంగతి!
on Apr 9, 2020
'ఇస్మార్ట్ శంకర్' వంటి కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్తో ఆడియెన్స్ను అలరించిన రామ్తో సినిమాలు చేసేందుకు పేరుపొందిన నిర్మాతలు, దర్శకులు ముందుకు వస్తున్నారు. అయితే రామ్ మాత్రం హడావిడి ప్రదర్శించడం లేదు. ప్రస్తుతం అతడు పూర్తి చేసిన 'రెడ్' మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. నిజానికి కరోనా గొడవ, థియేటర్ల మూసివేత లాంటివి లేనట్లయితే ఈరోజు (ఏప్రిల్ 9) 'రెడ్' మూవీ రిలీజై ఉండేది. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఆ సినిమాను స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. తమిళ హిట్ ఫిల్మ్ 'తాడమ్' ఆధారంగా తయారైన ఈ సినిమాలో కవల సోదరులుగా రామ్ డ్యూయల్ రోల్ చేశాడు.
'రెడ్' రిలీజ్ తర్వాతే తన తదుపరి సినిమాను ఫైనలైజ్ చేయాలని రామ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈలోగా డైరెక్టర్ మారుతితో కలిసి పనిచేయడానికి అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రచారాన్ని మారుతి స్వయంగా ఖండించాడు. అంటే సమీప భవిష్యత్తులో రామ్, మారుతి కలిసి పనిచేసే అవకాశం లేనట్లేననేది స్పష్టం. 'ప్రతిరోజూ' పండగే వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత తీరిగ్గా స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్నాడు మారుతి. అది పూర్తయ్యాకే ఎవరితో చేస్తాననేది చెప్తానని ఆయన అంటున్నాడు.