లాక్డౌన్ పూర్తయ్యాక నేను ఫస్ట్ చేయాల్సిన పని అదే!
on Apr 9, 2020
సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేదు... లాక్డౌన్ వల్ల ప్రతి ఒక్కరూ గూటికి పరిమితమయ్యారు. గుమ్మం దాటి బయటకు రావడం లేదు. లాక్డౌన్ ఎత్తేశాక ఏయే పనులు చేయాలని ఎవరికి వారు ప్లాన్స్ వేసుకుంటున్నారు. కుమారి హెబ్బా పటేల్ కూడా ఏం చేయాలని ఇప్పుడే ప్లాన్ చేసుకున్నారు. జిమ్ కి అనుకుంటున్నారు.
'లాక్డౌన్ పూర్తయిన తర్వాత మీరు చేయబోయే మొట్టమొదటి పని ఏది?' అని హెబ్బా పటేల్ ని అడిగితే... "జిమ్ కి వెళతా. దేవుడికి తెలుసు... నేను జిమ్ కి వెళ్లడం ఎంత అవసరం అనేది" అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం బరువు పెరగకుండా తినే మార్గం ఏదైనా ఉంటే తెలుసుకోవాలని ఉందని ఆమె అన్నారు. లాక్ టౌన్ వల్ల తినడం పడుకోవడం మాత్రమే చేస్తున్నానని హెబ్బా పటేల్ తెలిపారు.
సినిమాల విషయానికి వస్తే... యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో 'రెడ్' సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ చాలా ఫన్ గా ఉందనీ, అ సాంగ్ కోసం వెయిట్ చేయమని హెబ్బా పటేల్ అంటోంది.
Also Read