జోర్డాన్లో చిక్కుకుపోయిన సినిమా యూనిట్
on Apr 2, 2020
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న 'ఆడుజీవితం' సినిమా యూనిట్ అరబ్ దేశం జోర్డాన్లో చిక్కుకుంది. జోర్డాన్లో 'వాడి రమ్' ఎడారిలో షూటింగ్ కోసమని 58మంది సభ్యులతో కూడిన యూనిట్ మార్చిలో అక్కడికి వెళ్లింది. తమ యూనిట్ ఇండియాకి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోమని కేరళ ప్రభుత్వం, ఫిల్మ్ ఛాంబర్కు దర్శకుడు బ్లేస్సీ లెటర్ రాశారు.
'ఆడుజీవితం' కథలో భాగంగా కథానాయకుడు ఎడారిలో కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి. ఆ సీన్స్ తీయడం కోసం జోర్డాన్ వెళ్లినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసిరింది. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నారు. అప్పుడు 'లైఫ్ మీట్స్ సినిమా' అని పృథ్వీరాజ్ సుకుమారన్ ట్వీట్ చేశారు. తొలుత ఏప్రిల్ రెండో వారం వరకూ షూటింగ్ చేసుకోవడానికి 'ఆడు జీవితం' యూనిట్కు అనుమతి ఇచ్చిన జోర్డాన్ ప్రభుత్వం, తర్వాత పరిస్థితుల దృష్ట్యా అనుమతులు రద్దు చేసింది. దాంతో ఎడారిలో యూనిట్ అంతా చిక్కుకుంది. ప్రస్తుతానికి ఆహారం విషయంలో ఇబ్బందులు లేవు. ఆల్రెడీ ఇండియన్ ఎంబసీ, కేరళ ప్రభుత్వం యూనిట్ సభ్యులను వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.
Also Read