ఫ్యాన్స్ను వెర్రెత్తించడానికి 22న టీజర్తో వస్తోన్న మహేశ్!
on Nov 19, 2019
సూపర్స్టార్ మహేశ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్ను స్టార్ట్ చేసేందుకు నిర్మాతలు ముహూర్తం నిర్ణయించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తయారవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ టీజర్ను నవంబర్ 22న లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా మంగళవారం సాయంత్రం 6:03 గంటలకు వెల్లడి చేసింది. దీని కోసం టాలీవుడ్లోనే తొలిసారిగా 'అన్లాక్' టూల్ను ప్రవేశపెట్టింది. అంటే ట్విట్టర్ అకౌంట్లో అదిపెట్టిన 'అన్లాక్' టూల్ను క్లిక్ చేస్తే మనకు టీజర్ రిలీజ్ డేట్ రివీల్ అవుతుందన్న మాట. అలా ఫ్యాన్స్లో 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ డేట్ ఎప్పుడా అనే క్యూరియాసిటీని అమితంగా క్రియేట్ చేశారు. నవంబర్ 22న మూవీ ఫస్ట్ టీజర్ వస్తుందనే సమాచారంతో మహేశ్ ఫ్యాన్స్లో సంబరాలు ఒక్కసారిగా అంబరాన్ని అంటాయి. "గెట్ రెడీ పీపుల్. మాస్ మహేశ్ బాబు మేనియా బిగిన్స్ విత్ 'సరిలేరు నీకెవ్వరు' టీజర్! లెట్స్ సెట్ ద స్క్రీన్స్ ఆన్ ఫైర్" అంటూ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది.
క్షణాల వ్యవధిలోనే 'సరిలేరు నీకెవ్వరు' అనే హ్యాష్టాగ్ ట్విట్టర్ ట్రెండింగ్లోకి రావడం విశేషం. దానికంటే ముందు 'అన్లాక్ ఎస్ఎల్ఎన్ టీజర్ డేట్' అనే హ్యాష్టాగ్ ట్రెండింగ్లో ఉంది. అంటే ఈ రెండు హ్యాష్టాగ్లూ ఇప్పుడు ట్విట్టర్ వేదికపై హల్చల్ చేస్తున్నాయి. 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ లోడ్ అవుతున్నదనే విషయాన్ని మూడు రోజుల క్రితమే, అంటే నవంబర్ 16నే అనిల్ రావిపూడి బయటపెట్టాడు. 'టీజర్ లోడింగ్' అంటూ 'సరిలేరు నీకెవ్వరు' ట్యాగ్ను జోడించడంతో దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలోనే మూవీ టీజర్ బయటకు రానున్నదనే విషయం తెలియడంతో, ఆ డేట్ ఎప్పుడా అనే ఆత్రుతతో మహేశ్ ఫ్యాన్స్ అల్లాడిపోతూ వచ్చారు.
మంగళవారం మధ్యాహ్నం టీజర్ రిలీజ్ డేట్ టైం సాయంత్రం 6:03 గంటలకు వెల్లడి అవుతుందంటూ ఫ్యాన్స్ను ప్రొడక్షన్ హౌస్ ఊరించింది. 'అన్లాక్ ఎస్ఎల్ఎన్ టీజర్ డేట్'తో ప్రి సెలబ్రేషన్స్ మొదలవుతున్నాయంటూ అది ట్వీట్ చేసింది. మరో మూడు గంటల తర్వాత టీజర్ డేట్ను అన్లాక్ చేయడానికి 'సరిలేరు నీకెవ్వరు' టీం ఒక యూనిక్ ప్లాన్తో వస్తోందని తెలిపారు. "సినిమా ప్రమోషన్స్ను మొదలుపెట్టడానికి మూవీ మేకర్స్ రంగం సిద్ధం చేశారు. టీజర్ త్వరలోనే బయటకు వస్తుందంటూ ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. తాజాగా టీజర్ డేట్ను అన్లాక్ చెయ్యడానికి ఒక యూనిక్ ప్లాన్తో ముందుకు వచ్చారు. ట్విట్టర్ వేదికపై అన్లాక్ ఫీచర్ను ఉపయోగించడం ఒక తెలుగు సినిమాకి సంబంధించి ఇదే ప్రథమం. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ అకౌంట్పై 6:03 గంటలకు టీజర్ డేట్, టైంను వెల్లడి చేస్తారు. దీని కోసం ఒక కొత్త టూల్ను నిర్మాతలు ఉపయోగిస్తున్నారు" అంటూ తెలిపింది.
ఫ్యాన్స్లో ఉత్కంఠ మరింత పెరిగింది. దాన్ని ఇంకా పెంచుతూ, మరో రెండు గంటల తర్వాత "ఈరోజును 'సూపర్ఫ్యాన్స్'కు అంకితం చేస్తున్నాం. గెట్ రెడీ ఫర్ ద మాస్ మహేశ్ బాబు ధమాకా ఎట్ 6:03 పీఎం" అంటూ ట్వీట్ చేసింది ప్రొడక్షన్ హౌస్. ఆ వెంటనే డైరెక్టర్ అనిల్ రావిపూడి రంగం మీదకు వచ్చాడు. "సూపర్స్టార్కు సంబంధించిన మాసివ్ న్యూస్ను వెల్లడి చేయబోతోంది ఎవరో ఊహించండి. 'నువ్వు'.. ఎందుకంటే .. సరిలేరు నీకెవ్వరు" అంటూ ట్వీట్ చేశాడు. దాంతో అదెలాగా? అంటూ ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. అన్నట్లే ఏకే ఎంటర్టైన్మెంట్స్ 'అన్లాక్' టూల్తో టీజర్ డేట్ను బయటపెట్టింది. ఫ్యాన్స్ అంతా ఆ టూల్ను అన్లాక్ చేసి 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ డేట్ నవంబర్ 22 అనే విషయం తెలుసుకున్నారు. వెంటనే సంబరాల్లో మునిగిపోయారు.
ఆ తర్వాత టీజర్ రిలీజ్ టైంను కూడా ప్రొడక్షన్ హౌస్ బయటపెట్టింది. ఆ టైం.. 22 నవంబర్ సాయంత్రం 5:04 గంటలు! "నవంబర్ 22 సాయంత్రం 5:04 గంటలకు మేజర్ అజయ్ కృష్ణను చూడండి" అంటూ ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థలు రెండూ ట్వీట్ చేశాయి. అంటే శుక్రవారం మహేశ్ ఫ్యాన్స్కు ఒక పెద్ద పండగే. మహేశ్ జోడీగా రష్మికా మందన్న నటిస్తోన్న ఈ సినిమాలో విజయశాంతి, ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు చేస్తున్నారు. జనవరి 12న 'సరిలేరు నీకెవ్వరు' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతదాకా మూవీకి సంబంధించిన ప్రచారం ఎప్పుడు మొదలవుతుందా అని అత్యంత ఆత్రుతగా ఎదురు చూస్తూ వస్తున్న వాళ్లు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 22న టీజర్ అనే ఒక చిన్న శాంపిల్తో మేజర్ అజయ్ కృష్ణగా మహేశ్ ఎలా ఫ్యాన్స్ను వెర్రెత్తిస్తాడో.. వెయిట్ అండ్ సీ..