ప్రతి రోజు పండగే అంటోన్న సాయి ధరమ్ తేజ్
on Jun 24, 2019
`చిత్రలహరి` సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఆ సినిమా ఉత్సాహంతో మరో సినిమాకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో జిఏ2, యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ప్రతి రోజు పండగే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో షూటింగ్ లాంఛనంగా ప్రారంభించారు. సాయి ధరమ్ తేజ్ కు జంటగా రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు ట్యూన్స్ కంపోజింగ్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. `శైలజా రెడ్డి అల్లుడు` సినిమాతో కాస్త తడబడ్డ దర్శకుడు మారుతి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వర్స్ చేస్తున్నాడట. జూలై నుంచి కంటిన్యూ షెడ్యూల్ జరగనుందని సమాచారం.