ప్రభాస్ ఒత్తిడి ఫీలవుతున్నాడా???
on Jan 16, 2019
`బాహుబలి` చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తోన్న భారీ చిత్రం `సాహో`. దాదాపు రెండు వందల కోట్ల బడ్జె తో రూపొందుతోన్న ఈ చిత్రం ఆఖరి దశకు వచ్చింది. రెండో సినిమాకే సుజిత్ ను నమ్మి అంత బడ్జెట్ పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటూ అందరూ యువి క్రియేషన్స్ వారిని భయపెట్టినప్పటికీ సుజిత్ మీద నమ్మకంతో సినిమా మొదలుపెట్టారు. ప్రభాస్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన మేకింగ్ వీడియో హాలీవుడ్ స్థాయిలో చూపించి అందర్నీ షాక్ కి గురి చేశాడు సుజిత్. ఇక ఈ చిత్రంలోని హీరో ఇంటర్ డక్షన్ సీన్ హాలీవుడ్ రేంజ్ లో డిజైన్ చేశాడట దర్శకుడు సుజిత్. ఈ ఎంట్రీ ధూమ్ -2 లా రాబరీ సీన్ తో ఉంబోతున్నట్లు తెలుస్తోంది. హీరో, నిర్మాతలు సుజిత్ పై పెట్టుకున్న నమ్మకానికి ఏ మాత్రం తగ్గకుండా సినిమాను తీర్చిదిద్దుతున్నాడట సుజిత్. `రన్ రాజా రన్` చిత్రంతో మెప్పించిన సుజిత్ `సాహో` చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో రాబరీ సీన్ రామోజీ ఫిలిం సిటీలో భారీ గా పిక్చరైజ్ చేశారు. ఈ చిత్రాన్ని అగస్టు 15న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ప్రభాస్ మరో చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే ఇటలీలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. లవ్ స్టోరిగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. రాధాకృష్ణ కూడా ఒకే సినిమా చేశాడు గతంలో . అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఇలా ఇద్దరు కొత్త దర్శకులతో వెంట వెంటనే సినిమాలు చేస్తూ రిస్క్ చేస్తున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. ప్రభాస్ కు ఇద్దరి పై నమ్మకం ఉన్నా కానీ. కొంచెం ఒత్తిడి ఫీలవుతున్నాడని సన్నిహితుల నుంచి తెలుస్తోంది.