ఇదేం పని చోటాకు చిరిగి చాటవుతోంది!!
on Nov 13, 2018
హైదరాబాద్లోని దస్పల్లా హోటల్ లో `కవచం` ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశాడు చోటా కే నాయుడు. అయితే ఈ చిత్రం ప్రెస్ మీట్ గానూ హీరోయిన్ గా నటించిన కాజల్ కూడా హాజరైంది. అయితే ఈ కార్యక్రమలో స్టేజ్ మీద కాజల్ మాట్లాడుతూ...``అందరి గురించి చెబుతూ చోటా గురించి చెప్పుకొచ్చింది. ఇంతలో చోటా కే నాయుడు ఆమెకు హగ్గిస్తూ పనిలో పనిగా ముద్దు కూడా పెట్టేసాడు. వెంటనే కాజల్ మా ఫ్యామిలీ పర్సన్ లో ఒకరు చోటా అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. అప్పటి వరకు అందరూ లైట్ గా తీసుకున్నా కానీ, మీటూ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న తరుణంలో ఇలా చోటా కే నాయుడు చేయడం సరి కాదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇక కాజల్ ఫ్యాన్స్ అయితే చోటా కే నాయుడు లాంటి వారికి బాటా తో బదులియ్యాలంటూ. ఊరికే వదలకూడదూ టాలీవుడ్ నుంచి బహిష్కరించాలంటూ ఫైరవుతున్నారు. గతంలో కూడా ఇలా పలు హీరోయిన్స్ పై చోటా కే నాయుడు కామెంట్స్ చేసాడంటూ అవన్నీ మెల్ల మెల్లగా ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. ఏదో సరదాగా చేస్తే...చోటా కు చిరిగి చాటవుతోంది అంటున్నారు కొంతమంది. చూద్దాం చోటా కే నాయుడు దీనికి ఏ విధంగా బదులిస్తాడో...స్పందిస్తాడో మరి.