రజనీకాంత్ సినిమాకు బెదిరింపులు!!
on Nov 10, 2018
సూపర్ స్టార్ రజనికాంత్ , శంకర్ , అక్షయ్ కుమర్ కలయికలో వస్తోన్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం `2.ఓ`. ఈ సినిమాను లీక్ చేస్తామనీ, త్వరలో రాబోతుంది చూడంటూ పైరసీ వెబ్ సైట్ `తమిళ రాక్స్` ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిందట. ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో రజనీ ఫ్యానస్ కోపోద్రికులై తమిళ రాక్స్ పై మండిపడుతూ కోట్లకు కోట్లు పెట్టి సినిమా తీస్తే ఇలా చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారట. ఇప్పటికే దీపావళి కానుకగా విడుదలైన విజయ్ నటించిన `సర్కార్`, బాలీవుడ్ సినిమా ` థగ్స్ ఆఫ్ హిందుస్ఠాన్` చిత్రాలను తమిళ్ రాక్స్ పైరసీ చేసిందట. ఈ సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీకి గురి అవడం అందర్నీ షాక్ కి గురి చేసింది. అయినా ఆ రెండు చిత్రాలు కూడా కలెక్షన్స్ పరంగా బాగానే రాబడుతున్నాయి.
పైరసీని అరికట్టడానికి తమిళ నడిగర్ సంఘం వారు విశేషమైన కృషి చేస్తున్నా కానీ, ఇలా పైరసీ పాలు కావడంతో నిర్మాతలు భారీగా నష్టపోతున్నారట. దీన్ని ఎలాగైనా అరికట్టాలని ఇంకా తీవ్రంగా కృషి చేయాలని తమిళ నడిగరం సంఘం కృషి చేస్తోంది. అయితే దీనిపై తమిళ రాక్స్ స్పందిస్తూ...`2.ఓ` లీక్ చేస్తామంటూ సోషల్ మీడియాలో వస్తోన్న న్యూస్ కు మాకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటన ఇచ్చారట. దీంతో అసలు ఎవరు ఈ ట్వీట్ చేసారంటూ ఆ దిశగా సైబర్ క్రైమ్ వారు దృష్టి సారించారట. నిజంగా లీక్ కి గురైతే మాత్ర నిర్మాతలు భారీగా నష్టపోతారని అంటున్నారు సినీ పండితులు. దాదాపు ఐదు వందల కోట్లతో రూపొందిన ఈచిత్రం ఎన్నో వాయిదాల తర్వాత నవంబర్ 29న విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు విశేష మైన స్పందన వచ్చింది.