బ్యాడ్ టూ వరస్ట్ కు మారానంటున్న అల్లు శిరీష్
on Jun 23, 2018
సమస్యలు, కోపాలు సామాన్యులకే కాదు సెలెబ్రిటీలకు కూడా వస్తాయి.. వీటికి ఎవరు అతీతులు కాదు.. తాజాగా అల్లు శిరీష్ కార్పొరేట్ కంపెనీ మీద తన కోపాన్ని, అసహనాన్ని ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేసారు.. శిరీష్ ఎయిర్టెల్ నెట్వర్క్ తో సంతృప్తి చెందక వోడాఫోన్ కి మారిపోయారు.. దాంతో ఆ అసంతృప్తి కాస్త కోపంగా మారిపోయింది.. ఇంకేముంది ట్విట్టర్ లో తన కోపాన్ని పంచుకున్నారు.. 'ఏదైనా దూరమైతే కానీ దాని విలువ తెలీదు.. రీసెంట్ గా నేను ఎయిర్టెల్ నుంచి వోడాఫోన్ కి మారాను.. మారిన తర్వాత బ్యాడ్ టూ వరస్ట్ కు మారానని అర్ధమైంది.. 4జీ సంగతేమో కనీసం 2జీ కూడా పని చేయడం లేదు.. కాల్ డ్రాపింగుల వరకు ఎందుకు,సిగ్నల్ కూడా సరిగ్గా ఉండడం లేదు' అంటూ శిరీష్ ట్వీట్ చేసారు.. పాపం శిరీష్ అసంతృప్తి కాస్తా ఆవేదనగా మారి ట్విట్టర్ వేదికగా ఇలా అందరితో పంచుకుంటున్నాడనమాట.