చానెల్స్ బ్యాన్ పై నాగబాబు ఏమన్నారో తెలుసా?
on May 2, 2018
చాలా గ్యాప్ తర్వాత మల్లి నిర్మాత అవతారం ఇతడు మెగా బ్రదర్ నాగబాబు. "ఆరెంజ్" సినిమా ఫ్లాపైన తర్వాత ఇక ప్రొడక్షన్ కి దాదాపు స్వస్తి చెప్పి సీరియల్స్ అండ్ టీవీ షోస్ తో బిజీ అయిన నాగబాబు, మళ్ళీ తన అల్లుడు అల్లు అర్జున్ సినెమా నా పేరు సూర్య తో ప్రొడ్యూసర్ గా కంబ్యాక్ ఇస్తున్నాడు. ఈ నెల 4 కి విడుదలకి సిద్దమవుతున్న ఈ సినిమా గురించి నాగబాబు గారు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిర్మాత గా రీఎంట్రీ గురించి మాట్లాడుతూ, "నేను దాదాపు పదేళ్ళ తర్వాత నిర్మాతగా మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాను, మా అబ్బాయి హీరోగా వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. మా అమ్మాయి మంచి పాత్రలు చేస్తూ తన కెరీర్ ను ప్లాన్ చేసుకొంటోంది. "జబర్దస్త్" షో జడ్జ్ గా నేను కూడా బిజీగా ఉన్నాను. నా కెరీర్ లో ఇది బెస్ట్ ఫేజ్ అని చెప్పొచ్చు.
ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకొంటున్నాను," అని అన్నారు. కొందరు నా పేరు సూర్య పై నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం గురించి మాట్లాడుతూ, "కొన్ని వెబ్ సైట్స్, సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా "నా పేరు సూర్య" సినిమా బాలేదంట, అవుట్ పుట్ బాగా రాలేదంట అని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. ఆ విషయంలోనే నేను, అల్లు అరవింద్ చాలా బాధపడ్డాము. సినిమా రిలీజ్ అయ్యాక బాగుంది, లేదు అని డిసైడ్ చేయొచ్చు కానీ.. రిలీజ్ కి ముందే బాగోలేదని ఎలా డిసైడ్ చేస్తారు చెప్పండి. ఆ విషయంలో మాత్రం చాలా హార్ట్ అయ్యాం," అని తన బాధ వెల్లిబుచ్చుకున్నారు. ఇక కొన్ని ఛానెళ్లపై బ్యాన్ అంటూ వస్తున్న వార్తలకి స్పందిస్తూ, "ఏదో ఎవరో అన్నారని కొందరు కంగారుపడుతున్నారు కానీ.. అసలు ఇప్పటివరకూ న్యూస్ చానల్స్ ను బ్యాన్ చేయాలనే ఆలోచన కూడా మాకు లేదు. కేవలం ఇండస్ట్రీ మంచి కోసం ఏం చేయాలి అనేది మాత్రమే మేం చర్చించుకొన్నాం," అని వివరించారు. నా పేరు సూర్య నాగబాబు కి లాభాలు ఆర్జించాలని ఆశిద్దాం!