అడల్ట్ సినిమాకి ఓకే చెప్పిన సాయి పల్లవి
on Mar 22, 2018
తన మొదటి సినిమా ప్రేమమ్ తో మలయాళ ప్రేక్షకుల మనసు దోచుకున్న సాయి పల్లవి, ఆ తర్వాత ఫిదా తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయింది. తన కో-స్టార్స్ అంత అంద గత్తె కాకపోయినా, మంచి పర్ఫార్మర్ అన్న పేరుతో మంచి ఆఫర్లు కొట్టేసింది. అయితే, పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ, తన క్యారెక్టర్ కి ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ వస్తుంది. నాగ శౌర్య సరసన చేసిన కణం ఈ సమ్మర్ లో విడుదల కి సిద్దమవుతుంది. ఇదిలా ఉండగా, సాయి పల్లవి ఒక అడల్ట్ సినిమాకి ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు మిస్కిన్ తన తదుపరి చిత్రం కోసం నిత్య మీనన్ మరియు సాయి పల్లవి లని అనుకున్నాడట. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హాట్, హాట్ సీన్లు కాస్త ఎక్కువగానే ఉంటాయట. మరి, సాయి పల్లవి కూడా ఇలాంటి సీన్లలో నటిస్తుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. నిత్య మీనన్, పల్లవి ఇద్దరూ తమకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే, ఇద్దరు కలిసి ఇలాంటి సినిమా ఒప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.