సైరా ని బాలకృష్ణ ఎందుకు వదులుకున్నట్టు?
on Mar 21, 2018
మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ సైరా నరసింహ రెడ్డి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎప్పటి నుండో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి బయోపిక్ చేద్దాం అనుకుంటే మొత్తానికి మెగాస్టార్ కోరిక ఇప్పటికి నెరవేరుతుంది. అయితే, సైరా కథని అప్పుడెప్పుడో సిద్ధం చేసినప్పటికీ, చిరంజీవి రాజకీయాల్లో బిజీ గా ఉండడంతో దాన్ని కొన్ని సంవత్సరాలు పక్కకు పెట్టారట. ఆ తర్వాత, బాలకృష్ణ తన 100 వ చిత్రానికి మంచి కథ కోసం చూస్తున్న తరుణంలో, పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ కథ చెప్పారట. కానీ, స్క్రిప్ట్ అసంపూర్తిగా ఉండడంతో అప్పటికే క్రిష్ గౌతమీపుత్ర శాతకర్ణి బౌండెడ్ స్క్రిప్ట్ తో రావడంతో రెండో దానికే ఓటేశాడట. గౌతమీపుత్ర శాతకర్ణి ఎంత పెద్ద హిట్టయిందో మనందరికీ తెలిసిందే. ఇంక తన 150 వ సినిమా ఖైదీ నం 150 తో సూపర్ హిట్ కొట్టిన చిరు, తన తదుపరి చిత్రం గా సైరా కథని సిద్ధం చేయమన్నాడట. ఇంకొందరు రైటర్స్ టీం తీస్కొని రీసెర్చ్ చేసి పూర్తి కథ సిద్ధం చేశారట పరుచూరి బ్రదర్స్. మెగాస్టార్ తృప్తి చెందాక, షూటింగ్ మొదలు పెట్టారు. అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి లాంటి అగ్ర నటులు చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ లో పార్ట్ అయ్యేందుకు ఒప్పుకున్నారు. ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్న రామ్ చరణ్ ప్రతి విషయంలో ఫుల్ కేర్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న సైరా వచ్చే సంవత్సరం వేసవి కి ప్రేక్షకుల ముందుకి రానుందని సమాచారం.