జయమే ధ్యేయంగా జవాన్..
on Aug 15, 2017
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 'జవాన్' సినిమా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇటీవలే విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకోగా.. ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం రోజున కరెక్ట్ గా యాప్ట్ అయ్యే పోస్టర్ ను విడుదల చేశారు. ఇక పోస్టర్ లో ‘జెండా నీలో ధైర్యమురా.. జయమే దానికి ధ్యేయమురా’ అంటూ జాతీయ జెండాతో పాటు సాయిథరమ్ తేజ్ తన పిడికి బిగించి.. జాతీయ జెండాకు సలాం చేస్తున్నట్లు ఉన్న ‘జవాన్’ పోస్టర్ ప్రతి పౌరుడిలో దేశభక్తిని రగిల్చేదిగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సాయి ధరమ్ తేజ్ను జవాన్గా ఏ రేంజ్లో చూపిస్తున్నాడన్నది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా.. గతంలో గోపీచంద్తో వాంటెండ్ మూవీని తెరకెక్కించిన రవి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తుంది.