బాహుబలి-2లో ఆ ఐదుగురు అమ్మాయిలు ఎవరు..?
on Apr 24, 2017
ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచానికి బాహుబలి ఫీవర్ పట్టుకుంది. మొదటి భాగాన్ని మించి రెండో భాగాన్ని మరింత విజువల్ వండర్గా తెరకెక్కించాడు రాజమౌళి..ట్రైలర్ చూస్తే ఆ విషయం ఒప్పుకోకతప్పదు. ఇప్పటికే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడా అన్నది తెలుసుకోవాలని అభిమానులు క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి..ఒకవైపు రాజమౌళి నిర్మాతలతో కలిసి ప్రమోషన్స్ చేస్తుంటే, మరో వైపు ప్రభాస్, అనుష్క, రానాలు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు.
ప్రమోషన్లో భాగంగా రీసెంట్గా "సాహోరే బాహుబలి" వీడియో ప్రోమో సాంగ్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనిలో ప్రభాస్ వచ్చే సమయంలో పూలు చల్లుతున్న కొందరు పిల్లలు కనిపిస్తారు. వారు ఎవరో జూనియర్ ఆర్టిస్టులు కాదు..రాజమౌళి కూతురు మయూఖ, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి కుమార్తె అనన్య, సంగీత దర్శకుడు కీరవాణి కుమార్తె కుముద్యతి, కెమెరామెన్ సెంథిల్ కుమార్ తనయులు రేయాన్, ధృవ. ఓ వైపు తల్లిదండ్రులు బాహుబలి కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తుంటే వారి పిల్లలు కూడా మేము సైతం అంటూ ఒక చెయ్యి వేశారు. మరి వాళ్లు ఇంకా ఏమైనా చేశారో లేదో తెలియాలంటే ఏప్రిల్ 28 వరకు వెయిట్ చేయాల్సిందే.