షాకింగ్ : వాళ్లని చంపేస్తా అంటున్న రకుల్ప్రీత్ సింగ్
on Feb 21, 2017
ఇటీవల కేరళలో జరిగిన కథానాయిక భావన కిడ్నాప్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై మన కథానాయికలు మెల్లమెల్లగా గళం విప్పుతున్నారు. తనపైనా ఇలాంటి లైంగిక దాడులు నాపైనా చాలా జరిగాయంటూ తమిళ కథానాయిక వరలక్ష్మి నోరు విప్పి షాక్కి గురిచేసింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది. తనకు ఇలాంటి వ్యక్తులు ఎదురైతే... చంపేస్తా అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. భావన ఉదంతం తనలో తీవ్రమైన భయాందోళనలను కలిగించిందని, నిజంగానే అలాంటివాళ్లు తనకెదురైతే చంపేస్తానని వ్యాఖ్యానించింది రకుల్.
కథానాయికలకు భద్రత కరువైందన్న విషయాన్ని రకుల్ గుర్తు చేస్తోంది. ఆమధ్య తన అనుమతి లేకుండా తన ఫొటోల్ని తీస్తున్న ఓ యువకుడ్ని ఎదరించానని, తనపై దాడికి దిగినా ఊరుకోలేదని, వెంటాడి మరీ కొట్టానని పాత అనుభవాల్ని గుర్తు చేసింది. ఆడవాళ్లు మానసికంగానే కాదు, శారీరకంగానూ ఫిట్ గా ఉండాలని, అప్పుడే ఇలాంటి ఆగడాలను అరికట్టొచ్చంటుంది రకుల్. తాను బయటకు ఎప్పుడెళ్లినా అమ్మ హెచ్చరిస్తుంటుందట. త్వరగా వచ్చేయమని, ఎవ్వరినీ నమ్మొద్దని అంటూ ఉండేదట. అయితే ఏనాడూ అమ్మ వ్యాఖ్యల్ని రకుల్ సీరియస్గా తీసుకోలేదట. అమ్మ ఆరోజు ఎందుకలా చెప్పేదో ఇప్పుడు అర్థమైంది అంటోంది రకుల్ప్రీత్ సింగ్.