చిరంజీవి.. మోహన్బాబు.. ఏంటీ డ్రామా??
on Feb 20, 2017
టాలీవుడ్లో టామ్ అండ్ జర్రీ జంటగా గుర్తింపు తెచ్చుకొన్నారు చిరంజీవి- మోహన్ బాబు. ఒకరంటే ఒకరికి పడదన్నది టాలీవుడ్ జనాల టాక్. తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా వీరిద్దరి మధ్య లుకలుకలు పతాక స్థాయిలో వినిపించాయి. చిరుకి పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు కూడా.. మోహన్ బాబు వేదికపై చేసిన సంచలన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే... ఇద్దరూ ఓ చోట చేరితే మాత్రం... కౌలిగింతలు, ఇకఇకలు, పకపకలూ మామూలే.
ఇప్పుడు మెగా అభిమానులు కలవరపడి, మంచు అభిమానులు సంబరపడే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.... మంచు మనోజ్ సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడం. మనోజ్ కథానాయకుడిగా నటించిన చిత్రం గుంటూరోడు. ఈ సినిమా కోసం చిరు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఎలాంటి ఎట్రాక్షన్ లేక డీలా పడిన గుంటూరోడు సినిమా పబ్లిసిటీకి ఇది ఓ సరికొత్త కిక్క్. మొన్నే చిరు వాయిస్ ఓవర్ అందించిన ఘాజీ విడుదలై.. మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తమ హీరోకీ కలసి వస్తుందని మంచు అభిమానులు ఆశలు పెట్టుకొన్నారు.
పచ్చగడ్డి వేస్తే భగ్గుమని చిరు ఫ్యామిలీకీ - మోహన్ బాబు ఫ్యామిలీకి మధ్య ఈ లిటికేషన్ ఏంటన్నది మెగా అభిమానులకు అర్థం కావడం లేదు. ఇద్దరూ పడనట్టే ఉంటారు.. కానీ స్నేహితుల్లా ఇట్టే కలసిపోతుంటారు. ఈ స్నేహం ఫొటోలకే పరిమితమా, ఆ నవ్వులన్నీ ప్లాస్టిక్ నవ్వులేనా...? లేదంటే అసలు వీళ్లిద్దరి మధ్య గొడవలే.. ఉత్తి డ్రామానా..? మొత్తానికి మెగా- మంచు ఫ్యామిలీ రెండూ ఒకటే అని. కొట్టుకొనే ఫ్యాన్సే.. పరాయి వాళ్లని మరోసారి రుజువైంది.