నిర్మాతని చేస్తానని చెప్పి.... కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి...
on Feb 20, 2017
భావన కిడ్నాప్ వ్యవహారం చిత్రసీమని కుదిపేస్తోంది. ఇండ్రస్ట్రీలోని చీకటి వ్యవహారాలకు, భద్రత లేని భాగోతాలకు ఇదో ప్రత్యక్ష నిదర్శనం. అయితే.. ఇలాంటి వ్యవహారమే మరోటి వెలుగు చూసిందిప్పుడు. అదీ... టాలీవుడ్లో. ఓ దర్శకుడు ఫేస్ బుక్ పరిచయంతో ఓ మహిళను లొంగదీసుకొనే ప్రయత్నం చేయడం, ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. టాలీవుడ్లో నయా సంచలనంగా మారింది.
నారా రోహిత్తో పండగలా వచ్చాడు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న కార్తికేయ ప్రసాద్.. ఫేస్ బుక్ ద్వారా విశాఖపట్నానికి చెందిన ఓ గృహిణితో పరిచయం పెంచుకొన్నాడు. అది కాస్త స్నేహంగా మారింది. హైదరాబాద్ వస్తే నిన్ను నిర్మాతను చేస్తా... అంటూ ఆమెకు మాటిచ్చాడు ఈ దర్శకుడు. ఆ మాట నమ్మి.. హైదరాబాద్ వచ్చేసిందామె. తనని మాటల్లో పెట్టి, కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఆమెను లోబర్చుకొనే ప్రయత్నం చేశాడని ఆ మహిళ ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు కార్తికేయని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.