విక్రమ్తో తరుణ్ భాస్కర్ హీరోయిన్
on Feb 22, 2021
`పెళ్ళిచూపులు` దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన `మీకు మాత్రమే చెప్తా`లో అతని లవ్ ఇంట్రస్ట్ గా ఇంప్రెస్ చేసింది వాణీ భోజన్. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నటిగా వాణికి మంచి మార్కులే పడ్డాయి. `మీకు మాత్రమే చెప్తా`కి ముందు, తరువాత తమిళ చిత్రాల్లోనే నటిస్తూ వస్తున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ ని.. తాజాగా ఓ బంపర్ ఆఫర్ వరించిందట.
ఆ వివరాల్లోకి వెళితే.. చియాన్ విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ ప్రధాన పాత్రల్లో కార్తిక్ సుబ్బురాజ్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాలో విక్రమ్ కి జోడీగా వాణీ భోజన్ ని ఎంపిక చేశారట. అంతేకాదు.. అభినయానికి అవకాశమున్న పాత్రలో వాణి దర్శనమివ్వనుందని టాక్. త్వరలోనే విక్రమ్ - ధ్రువ్ చిత్రంలో వాణి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, ప్రస్తుతం వాణి చేతిలో ఐదు తమిళ చిత్రాలున్నాయి. వీటిలో `గగనం` ఫేమ్ రాధామోహన్ రూపొందిస్తున్న సినిమాతో పాటు కోలీవుడ్ స్టార్ సూర్య నిర్మిస్తున్న పేరు నిర్ణయించని మూవీ కూడా ఉంది. మరి.. రాబోయే చిత్రాలతో తరుణ్ భాస్కర్ హీరోయిన్.. స్టార్ లీగ్ లోకి చేరుతుందేమో చూడాలి.