చైతూతో మాళవిక ఫిక్స్ అయినట్టే!
on Feb 22, 2021
`మనం` తరువాత యువసామ్రాట్ నాగచైతన్య, వెర్సటైల్ కెప్టెన్ విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా `థాంక్ యూ`. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బీవీఎస్ రవి కథ, మాటలు సమకూర్చుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొంత మేర చిత్రీకరణ జరిగింది. కాగా, తాజా షెడ్యూల్ ని రాజమండ్రిలో చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోంది. దాదాపు 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందట.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కి స్థానముందని.. వారిలో ఒకరిగా `ఎవడే సుబ్రమణ్యం` ఫేమ్ మాళవికా నాయర్ నటిస్తుందని ఆమధ్య కథనాలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. మాళవిక ఓ హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయిందని.. రాజమండ్రిలో జరిగే షెడ్యూల్ లో చైతుతో పాటు ఆమె కూడా చిత్రీకరణలో పాల్గొనబోతోందని టాక్. త్వరలోనే మాళవిక ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్న `థాంక్ యూ`.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో థియేటర్స్ లో సందడి చేయనుంది.