బాలీవుడ్ హీరోతో బాహుబలి మల్టీస్టారర్?
on Jul 6, 2020
‘బాహుబలి’ తరవాత బాలీవుడ్లో ప్రభాస్ క్రేజ్ పెరిగింది. అందుకు ‘సాహో’ హిందీ వెర్షన్ ఎగ్జాంపుల్. యావరేజ్ సినిమాకు అక్కడ దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ‘సాహో’ రిజల్ట్తో సంబంధం లేకుండా హిందీ హీరోయిన్లు, దర్శకులు ప్రభాస్తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. షూటింగ్స్ స్టార్ట్ అయితే ముందుగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్లో చేస్తున్న లవ్స్టోరీని ప్రభాస్ కంప్లీట్ చేయాలి. ఆ తరవాత ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సినిమా చేయాలి. ఈ రెండు సినిమాల తరవాత హిందీలో ప్రభాస్ మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడని బాలీవుడ్ బాతాఖానీ.
హృతిక్ రోషన్, ప్రభాస్ హీరోలుగా భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిండానికి హిందీలో సన్నాహాలు జరుగుతున్నాయట. అజయ్ దేవగణ్ హీరోగా, సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించిన పీరియాడిక్ డ్రామా ‘తానాజీ’ ఫేమ్ఓం రౌత్ ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తారని టాక్. ఎలా లేదన్నా రెండేళ్ల తరవాత ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. గతంలో హృతిక్ రోషన్ మల్టీస్టారర్స్ చేశాడు. ఒకవేళ ప్రభాస్ ఓకే చేస్తే... అతడికి ఇదే ఫస్ట్ మల్టీస్టారర్. ప్రజెంట్ ఈ సినిమా డిస్కషన్ స్టేజీలో ఉందని సమాచారం.
Also Read