ఆత్మహత్య చేసుకున్న తెలుగు యాంకర్
on Apr 2, 2018
తెలుగు న్యూస్ యాంకర్ రాధికా రెడ్డి ఆదివారం రాత్రి మూసాపేట్ లోని తన అపార్ట్మెంట్ 5 వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకి దొరికిన సూసైడ్ నోట్ ప్రకారం డిప్రెషన్ వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. "తన మెదడే తనకు శత్రువు" అని ఆ నోట్ లో పేర్కొంది. v 6 ఛానల్ లో ప్రతి రోజు 9 గంటలకు ప్రసారమయ్యే బులిటెన్ కి న్యూస్ రీడర్ గా పనిచేసే రాధికా రెడ్డి నిన్న రాత్రి కూడా తన జాబ్ పూర్తిచేసుకుని ఇంటికి వచ్చింది. వచ్చి రాగానే, తాను ఉంటున్న బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. గాయాలు ఎక్కువగా అవడంతో స్పాట్ లోనే చనిపోయిందని పోలీసులు తెలిపారు. ఆరు నెల్ల క్రితం భర్త నుండి విడాకులు తీసుకున్న రాధికా రెడ్డి తల్లిదండ్రులు, మరియు 14 ఏళ్ళ కొడుకుతో ఉంటుంది. వివిధ కథనాల ప్రకారం రాధికా రెడ్డి కొడుకు మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అయితే, భర్త నుండి దూరమవడం, కొడుకు మానసిక స్థితి వల్ల రాధికా గత కిన్ని రోజుల నుండి చాలా డిప్రెషన్ కి గురవుతుందని తెలిసింది.
Also Read