"నాయకి" మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది!
on Jul 4, 2016
సినిమా మొదలెట్టిన ముహూర్తం మంచిది కాదో, లేక త్రిషకు సరైన మార్కెట్ లేకపోవడం వల్లో తెలియదుగానీ.. ఆమె నటించిన "నాయకి" చిత్రం గత రెండు నెలలుగా విడుదలవ్వడానికి నానా పాట్లూ పడుతుంది. జూన్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకొన్నారు దర్శకనిర్మాతలు, అప్పుడు కుదర్లేదు. పోనీ జూలై 1న విడుదల చేద్దామనుకొన్నారు, అదీ సూట్ అవ్వలేదు. ఇక జూలై 8న కంపల్సరీగా రిలీజ్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయారు. కట్ చేస్తే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ ఉన్న కారణంగా సినిమా లేట్ అయ్యింది. ఇక ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ కూర్చుంటే.. థియేటర్ కి వచ్చే నలుగురు కూడా రారని ఫిక్సయినట్లున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 15న "నాయకి" చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట యూనిట్ సభ్యులు.
త్రిష టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో సత్యం రాజేష్ ముఖ్యభూమిక పోషించాడు. "లవ్ యూ బంగారం" ఫేమ్ గోవి దర్శకత్వం వహించాడు. హారర్ కామెడీ త్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నప్పటికీ.. ఆలస్యం కారణంగా అవి ఆవిరైపోతున్నాయి!