దర్శకనిర్మాతలతో రెండ్రోజులు త్రిష...!
on Jun 28, 2016
త్రిష టైటిల్ పాత్రలో నటించిన తాజా హారర్ సినిమా "నాయకి". "లవ్ యూ బంగారం" ఫేమ్ గోవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఎప్పుడో విడుదలైంది. జూన్ లోనే ఈ సినిమా విడుదలకావాల్సి ఉన్నప్పటికీ కుదరక ఎట్టకేలకు జూలైలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. జూలై 1న విడుదల చేద్దామనుకొన్నారు కానీ.. సినిమా ప్రమోషన్స్ కి టైమ్ సరిపోదని ఊరుకొన్నారు. ఇప్పుడు త్రిష కూడా ప్రమోషన్స్ కోసం రెండ్రోజులు దర్శకనిర్మాతలకు కేటాయించడంతో.. జూలై 8న సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యం రాజేష్, గణేష్ వెంకట్రామన్ లు కీలకపాత్రలు పోషించారు. ఎన్నడూలేని విధంగా ఈ సినిమాలో త్రిష తన యద లోతులను బహిర్గతపరుస్తూ బి,సి సెంటర్ ఆడియన్స్ ను అలరిస్తుంది. మరి సదరు క్లీవేజ్ షో సినిమాకు ఏమేరకు సహాపడుతుందో చూడాలి!
Also Read