'నవరస' ట్రైలర్ వచ్చేసింది.. అంతకుమించి!!
on Jul 27, 2021
భారీ తారాగణంతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మిస్తోన్న అంథాలజీ 'నవరస'. నవరసాల నేపథ్యంలో తొమ్మిది భాగాలుగా ఈ సిరీస్ రానుంది. ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ని విడుదల చేసింది నెట్ఫ్లిక్స్.
లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం, సీనియర్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర పంచపకేశన్ ఈ అంథాలజీని రూపొందించారు. సూర్య, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, ప్రకాష్ రాజ్, రేవతి, ఐశ్వర్యరాజేష్, అరవింద్ స్వామి, రోబో శంకర్, యోగిబాబు, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్సిరీస్ ట్రైలర్ను మంగళవారం (జూలై 27) నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. టైటిల్ కి తగ్గట్టుగానే తొమ్మిది భావోద్వేగాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. నేపథ్య సంగీతం ట్రైలర్ కి ప్రధాన బలంగా నిలిచింది.
రతీంద్రన్ ఆర్. ప్రసాద్, అరవింద్ స్వామి, బిజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సర్జున్ కె.ఎం, ప్రియదర్శన్, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజ్, వసంత్ ఈ తొమ్మిది కథలకి దర్శకత్వం వహించారు. పాండమిక్ సమయంలో ఇబ్బందులు పడ్డ తమిళ సినీ కార్మికులని ఆదుకోవడమే లక్ష్యంగా ఈ అంథాలజీ రూపుదిద్దుకుంది. ఈ అంథాలజీ ద్వారా వచ్చిన మొత్తాన్ని కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు అందజేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.
Also Read