రాజశేఖరా... కథ నచ్చిందట..!
on Oct 27, 2018
నందితా శ్వేతా... ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? నిఖిల్ కథానాయకుడిగా నటించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో తెలుగు తెరకు పరిచయమైంది! ఈ అమ్మాయిని అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. తొలి సినిమాలో అందంతోనూ, అభినయంతోనూ ఆకట్టుకుంది. ఈ ఏడాది విడుదలైన 'శ్రీనివాస కళ్యాణం'లో హీరో నితిన్కి మరదలుగా నటించింది. ఇప్పుడీ అమ్మాయి తెలుగులో మరో చిత్రానికి సంతకం చేసిందని సమాచారం. రాజశేఖర్ కథానాయకుడిగా నటించనున్న తాజా సినిమా 'కల్కి'. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. 'అ!' సినిమాతో విమర్శకుల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో నందితా శ్వేతా నటించనుంది. ఈ సినిమాలో ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు వుంటార్ట. అయినా కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో నటించడానికి నందితా శ్వేతా అంగీకరించిందట! తమిళంలో 'దేవి-2' (తెలుగులో 'అభినేత్రి'గా విడుదలైన ప్రభుదేవా, తమన్నా సినిమాకు సీక్వెల్)తో పాటు తెలుగులో 'ప్రేమకథా చిత్రమ్-2'లో నందితా శ్వేతా నటిస్తుంది.