సింహాల బోనులోకి అల్లు అరవింద్..!!
on Dec 4, 2017
టాలీవుడ్కు వచ్చే సరికి మూడు సీజన్లు చాలా ముఖ్యమైనవి.. అవి సంక్రాంతి, సమ్మర్, దసరా. ఎంతటి బడా సినిమా అయినా.. చిన్న సినిమా అయినా ఈ సీజన్లలోనే రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తుంటారు. ఈ టైంని తాము కూడా మిస్ చేసుకోకూడదనే ఉద్దేశ్యంతో డబ్బింగ్ సినిమాల దండయాత్ర కూడా మొదలవుతుంది. ఎప్పటిలాగానే ఈ సారి కూడా సంక్రాంతికి భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 10న పవర్స్టార్ పవన్కళ్యాణ్ "అజ్ఞాతవాసి"గా, 12న నందమూరి నటసింహం బాలయ్య "జై సింహా"గా వస్తున్నాడు. ఇంత టఫ్ ఫైట్లో వేరే హీరోకి తన సినిమాను రిలీజ్ చేయాలన్న ఆలోచనే రాదు. అలాంటిది తమిళ స్టార్ హీరో సూర్య మాత్రం సై అంటున్నాడు.
ఆయన లేటేస్ట్ మూవీ "తానా సేంద్ర కూట్టం"ను తెలుగులో "గ్యాంగ్" అన్న పేరుతో జనవరి 12న తెలుగు, తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇప్పటికే పవన్, బాలయ్య సినిమాలకు థియేటర్లు కరువైన నేపథ్యంలో గ్యాంగ్కు స్క్రీన్లు ఎక్కడి నుంచి వస్తాయి అన్న డౌట్ మీకు రావొచ్చు. ఇక్కడే సూర్య ఒక మాస్టర్ ప్లాన్ గీశాడు.. తన సినిమా డబ్బింగ్ రైట్స్ను అల్లు అరవింద్ చేతిలో పెట్టాడు. తెలుగునాట అరవింద్కు ఉన్న పలుకుబడి సామాన్యమైనది కాదు. సీమాంధ్రలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లోని మేజర్ థియేటర్లన్నీ అల్లువారి గుప్పిట్లోనే ఉన్నాయన్నది ఓపెన్ టాక్. సూర్యకి తమిళ్తో పాటుగా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉండటంతో బాలయ్య సినిమాకి కష్టాలు తప్పవేమో అంటున్నారు సినీ జనాలు.