డ్రగ్స్ కేసులో మహేశ్ వైఫ్ నమ్రత? టాలీవుడ్లో ప్రకంపనాలు!
on Sep 22, 2020
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మహేశ్బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు తెరపైకి రావడం సంచలనం కలిగిస్తోంది. డ్రగ్స్ కేసులో కొన్ని జాతీయ చానళ్లు నమ్రత పేరును ప్రస్తావించాయి. కొద్ది రోజులుగా బాలీవుడ్లో రియా చక్రవర్తి చుట్టూ నడుస్తోన్న డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) చేస్తున్న దర్యాప్తులో ఒక్కొక్కటిగా సెలబ్రిటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, దీపికా పడుకోనే తర్వాత ఇప్పుడు నమ్రత పేరు బయటకు రావడం గమనార్హం.
ఎన్సీబీ చేసిన విచారణలో రియా చక్రవర్తి 25 మంది పేర్లను ప్రస్తావించినట్లు నేషనల్ మీడియాలో విరివిగా ప్రచారంలోకి రావడం తెలిసిందే. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలెంట్ మేనేజర్ జయ సాహాతో నమ్రత ఫోన్లో సంభాషించినట్లు కథనాలు వస్తున్నాయి. ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్లు ఎన్సీబీ విచారణలో సాహా అంగీకరించినట్లు ప్రచారంలోకి వచ్చింది. జాతీయ మీడియాలో దీనిపై కథనాలు రావడం టాలీవుడ్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది.
జయ సాహా, నమ్రత మధ్య జరిగిన సంభాషణలో "ఎండీ" అనే కోడ్ను ఉపయోగించారని చెబుతున్నారు. "మంచి ఎండీ ఇస్తానని ప్రామిస్ చేశావ్. ముంబైలో కలుద్దాం.. పార్టీ చేసుకుందాం" అని నమ్రత ఆమెతో చెప్పిందంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. బాలీవుడ్లో మొదలైన డ్రగ్ కేసు ఇప్పుడు రకుల్, నమ్రత పేర్లతో టాలీవుడ్ మెడకూ చుట్టుకుంటోంది. ఇది ఎటుతిరిగి ఎటు వెళ్తుందోనని అందరూ అందోళన చెందుతున్నారు. మూడేళ్ల క్రితం డ్రగ్ కుంభకోణం టాలీవుడ్కు కుదిపేసి, చల్లారిన విషయం తెలిసిందే.
Also Read