నాగార్జునకు ఇప్పటికీ ఇష్టం లేదట! కానీ...
on Jul 22, 2019
కింగ్ నాగార్జున హోస్ట్ గా 'బిగ్ బాస్ 3' ఆదివారం రాత్రి ప్రారంభం అయింది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... తొలి రోజు బాగా చేశారు. తనదైన శైలిలో నవ్వించారు. షోను నడిపించారు. అదే సమయంలో తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టారు. బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో ఒకసారి నాగార్జున షోకి వచ్చారు. తనకు ఇది షో అంటే తనకు ఇష్టం లేదని చెప్పారు. సీజన్ 3 కి ఆయన హోస్ట్ చేస్తారు అనే వార్త బయటకు వచ్చినప్పుడు... ఇంటర్నెట్ లో చాలామంది సెటైర్లు వేశారు. ఇష్టం లేని షో కి ఎందుకు హోస్ట్ చేస్తున్నారని! సీజన్ 3 ఓపెనింగ్ రోజున ఈ విమర్శలకు నాగర్జున సమాధానమిచ్చారు. ఇప్పటికీ తనకు ఇష్టం అంటే ఇష్టం లేదని, ప్రేక్షకులందరికీ ఎందుకు ఇష్టమో తెలుసుకుందామని తానే స్వయంగా రంగంలోకి దిగానని చెప్పుకొచ్చారు. ఒక్క మాటతో విమర్శకుల నోళ్లు మూయించారు. అయితే... యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్త చేసిన ఆరోపణలపై మాత్రం నాగార్జున స్పందించలేదు. బహుశా... సెలక్షన్ ప్రాసెస్ తన పరిధిలోకి రాదని ఆయన భావించి ఉండవచ్చు. ఇక, బిగ్ బాస్ ఇంటిలో అడుగు పెట్టిన వారిలో నటి హేమ, యాంకర్ శ్రీముఖి, హీరో వరుణ్ సందేశ్, ఆయన భార్య వితిక షేరు, న్యూస్ ఛానల్ యాంకర్స్ టీవీ9 జాఫర్, v6 తీన్మార్ సావిత్రి చెప్పుకోదగినవారు. భార్య భర్తలు బిగ్ బాస్ ఇంట అడుగు పెట్టడం ఇదే తొలిసారి. మిగతా వారిలో డబ్ స్మాష్ ఫేమ్ ఆసు రెడ్డి, ఫన్ బకెట్ ఫేమ్ మహేష్ విట్టా, టీవీ సీరియల్ యాక్టర్స్ రోహిణి, రవి కృష్ణ తదితరులు ఉన్నారు.