శేఖర్ కమ్ముల నాలుగు నెలల్లో తీస్తాడట!
on Jun 27, 2019
ప్రతి సినిమాకు శేఖర్ కమ్ముల ఎక్కువ సమయం తీసుకుంటారు. ఏడాది కంటే ఎక్కువ రోజులు కథ, సినిమాలను చెక్కిన సందర్భాలు ఉన్నాయి. 'ఫిదా' తరవాత కొత్తవాళ్లతో ఓ సినిమా ప్రారంభించి, మధ్యలో పక్కన పెట్టేశారు. ఇప్పుడు నాగచైతన్యతో తీస్తున్న సినిమాను మాత్రం నాలుగు నెలల్లో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఏషియన్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. సెప్టెంబర్ తొలివారంలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య 'వెంకీమామ' షూటింగ్ చేస్తున్నారు. అది పూర్తయిన తరవాత శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్ ప్రారంభం కావొచ్చు. సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభించి, మూడు నెలలు నెలల్లో సినిమా పూర్తి చేసి ఈ ఏడాది ఆఖరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.