తెలంగాణ పోరడుగా చైతు!!
on Aug 17, 2019
డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏ సినిమా చేసినా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు. తన ప్రతి సినిమా లో ఎదో ఒక క్యారక్టర్ తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతుంది. ఇక `ఫిదా` సినిమాతో సాయి పల్లవి క్యారెక్టర్ తెలంగాణ అమ్మాయి గా డిజైన్ చేసాడు. ఆ పాత్రలో సాయి పల్లవి నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పాలి. ఇక తాజాగా నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే నాగ చైతన్య తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడిగా నటిస్తున్నాడు. ఇందులో చైతు తెలంగాణ స్లాంగ్ మాట్లాడతాడట. ఇప్పటికే యాస కు సంబంధిచిన ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
Also Read