చై-సమంత రిసెప్షన్లో వీరిద్దరూ మిస్సయ్యారేంటబ్బా..?
on Nov 13, 2017
టాలీవుడ్ కింగ్ నాగార్జున తనయుడు, హీరో నాగచైతన్య.. హీరోయిన్ సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ ఆదివారం రాత్రి హైదరాబాద్లోని ఎన్.కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. గత నెల అక్టోబర్ 6, 7 తేదీల్లో గోవాలోని ఓ రిసార్ట్లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో చైసామ్ల వివాహం జరగ్గా.. నెల రోజుల తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేశాడు నాగ్.
ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అంతా బాగానే ఉంది కానీ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈ వేడుకలో ఎక్కడ కనిపించకపోవడంపై ఫిలింనగర్లో హాట్ టాపిక్గా మారింది. ఈ మధ్యకాలంలో తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ పెళ్లిళ్ల వేడుకల్లో వీరిద్దరూ లేని వేడుక దాదాపుగా లేదు. మరీ రాజకీయ నాయకులతో అత్యంత సన్నిహతంగా మెలిగే నాగార్జున తనయుడి రిసెప్షన్లో వీరిద్దరూ ఎందుకు కనిపించలేదు.. నాగ్ వీరిని పిలిచాడా లేక పిలిచినా చంద్రులిద్దరూ బిజీగా ఉండి రాలేదా..? అన్న దానిపై ఇప్పుడు తెలుగు సినీ, రాజకీయ రంగాలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నాయి. మరీ అసలు మ్యాటర్ ఏంటో నాగ్కే తెలియాలి.