ప్రభాస్-దీపిక సినిమాపై నాగ్ అశ్విన్ కీలక అప్డేట్
on Feb 22, 2021
ప్రభాస్, దీపికా పడుకోనే జంటగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీని రూపొందించేందుకు సన్నద్ధమవుతున్నాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై సి. అశ్వనీదత్ నిర్మించే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దాని గురించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన 'పిట్టకథలు'లోని ఓ పిట్టకథ 'ఎక్స్ లైఫ్'కు ఆయన దర్శకత్వం వహించాడు. శ్రుతి హాసన్, సంజిత్ హెగ్డే ప్రధాన పాత్రలు పోషించిన ఇది కూడా సైన్స్ ఫిక్షన్ సబ్జెక్ట్తోటే రూపొందడం గమనార్హం. 'పిట్టకథలు' ప్రమోషన్లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన నాగ్ అశ్విన్ తన సినిమా షూటింగ్ జాప్యం అవడానికి కారణాన్ని వివరించాడు.
నిజానికి ప్రభాస్, దీపిక జంటగా నటించే మూవీ షూటింగ్ను మార్చి నెలలోనే ప్రారంభించాలనుకున్నామని ఆయన తెలిపాడు. కరోనా మహమ్మారి వల్లా, ప్రభాస్ ఇతర సినిమాల కమిట్మెంట్స్ కారణంగా మా సినిమాని మార్చిలో కాకుండా జూన్ లేదా జూలైలో ప్రారంభించే అవకాశాలున్నాయి అని చెప్పాడు.
అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా మిక్కీ జె. మేయర్, సినిమాటోగ్రాఫర్గా డాని సాంచెజ్ లోపెజ్ వర్క్ చేయనున్నారు. "అమితాబ్ బచ్చన్ గారు ఎంపిక చేసుకొంటున్న సినిమాల్లో మా సినిమా కూడా ఉండటం నా అదృష్టంగా, నాకు దక్కిన భాగ్యంగా భావిస్తున్నాను. ఆయనది ఫుల్ లెంగ్త్ రోల్. ఆయనైతేనే ఆ రోల్కు న్యాయం చేస్తారని మేం నమ్ముతున్నాం." అని చెప్పాడు నాగ్ అశ్విన్.
Also Read