మహానటి' దర్శకుడితో ప్రభాస్ సినిమా
on Jun 13, 2018
'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి బయోపిక్ అనగానే.. కేవలం ఒక్క సినిమా చేసిన యువ దర్శకుడు మహానటికి న్యాయం చేయగలడా? అనుకున్నారు.. కానీ మహానటి రిలీజ్ అయ్యాక.. అశ్విన్ తప్ప ఈ బయోపిక్ కి ఎవరు న్యాయం చేయలేరు అనే అంతగా పేరు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న క్రేజీ డైరెక్టర్ల లిస్ట్ లో అశ్విన్ కూడా చేరిపోయాడు.. అయితే అశ్విన్ తన నెక్స్ట్ సినిమాని ప్రభాస్ తో చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.. ప్రస్తుతం సాహో సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాని అశ్విన్ తో చేయడానికి అంగీకరించాడట.. మొత్తానికి అశ్విన్ మహానటి హిట్ తో మంచి ఆఫరే పట్టేసాడు.